Telangana: పట్టుతప్పి పడిపోయిన గవర్నర్‌ తమిళిసై

Telangana: పట్టుతప్పి పడిపోయిన గవర్నర్‌ తమిళిసై
జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రసంగించిన తరువాత నడుచుకుంటూ వెళ్తుండగా కార్పెట్‌పై జారి పడిపోయారు

తెలంగాణ గవర్నర్ తమిళి సై కాలు జారి కిందపడిపోయారు. నడుస్తూ నడుస్తూనే ఒక్కసారిగా స్లిప్ అయి పడిపోయారు. వెంటనే అలెర్ట్‌ అయిన గవర్నర్‌ వ్యక్తిగత సిబ్బంది ఆమెను పైకి లేపారు. అయితే ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. నిన్న తమిళనాడులోని మామల్లపురం గ్రామం దగ్గర్లో జరిగిన హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.వేదికపైన జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రసంగించిన తరువాత ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కార్పెట్‌పై జారి పడిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story