Telangana: పేలిన బస్సు టైర్‌.. తప్పిన ప్రమాదం

Telangana: పేలిన బస్సు టైర్‌.. తప్పిన ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్ల బావి సమీపంలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్ల బావి సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు టైర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 55మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బస్సులో సరైన టూల్ కిట్‌ లేకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చేసేదేమీ లేక ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులు వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story