Telangana: దేశపతి , చల్లా , నవీన్ల నామినేషన్ దాఖలు
By - Subba Reddy |9 March 2023 5:30 AM GMT
అసెంబ్లీలో జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో మంత్రులు హరీష్రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులతో కలిసి నామినేషన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామ్ రెడ్డి, నవీన్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో మంత్రులు హరీష్రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా.. 14న పరిశీలించనున్నారు. 16న నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగుస్తుంది.. మార్చి 23న పోలింగ్ ఉంటుంది.. అనంతరం అదే రోజు కౌంటింగ్ నిర్వహించి.. విజేతల్ని ప్రకటిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com