Telangana: నాకు ఈ కారు వద్దు..
ప్రగతి భవన్కు వెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు ఇచ్చిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం పదే పదే చెడిపోతోందని, ఎన్నిసార్లు చెప్పినా తన బాధ పట్టించుకోవడం లేదని, వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ను కోరడానికి ప్రగతి భవన్కు వెళ్లారు. అయితే పోలీసులు రాజాసింగ్ను అడ్డుకోవడంతో తన వెంట తీసుకువచ్చిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ ముందు వదిలేసి వెళ్లారు. ఈ నేపధ్యంలో రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని అసెంబ్లీ వద్ద విడిచిపెట్టారు.
పోలీసులు అరెస్ట్ చేసి, తనను ఎక్కడకు తీసుకెళ్తున్నారో తెలియడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆడియోలు విడుదల చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇచ్చేద్దామని ప్రగతిభవన్ కు వెళ్తే గేటు వద్దే తనను ఆపేశారని చెప్పారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం తాళాన్ని అక్కడే ఉన్న పోలీసు అధికారులకు ఇస్తే తీసుకోలేదని, దాంతో వాటిని అక్కడే పడేశానని చెప్పారు. ఇంతలోనే పంజాగుట్ట ఇన్స్ స్పెక్టర్ వచ్చి తనను అరెస్ట్ చేసి డీసీఎంలో కూర్చోబెట్టారని తెలిపారు. రాజాసింగ్ బులెట్ ఫ్రూఫ్ వాహనాన్ని పంజాగుట్ట పీఎస్లో వదిలివెళ్లారు పోలీసులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com