Telangana: పది ఫలితాలు నేడే..

Telangana:  పది ఫలితాలు నేడే..
ఇవాళ తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ప్రాంగణంలో

ఇవాళ తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ప్రాంగణంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలనువెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. మొత్తం 4 లక్షల 84 వేల 370 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో 9 మంది పాత విద్యార్థులకు సంబంధించి తెలుగు పరీక్ష జవాబుపత్రాల బండిల్‌ కనిపించకుండా పోయిన నేపథ్యంలో వారిని అంతర్గత మార్కులు ఆధారంగా పాస్‌ చేసినట్లు బోర్డు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story