BJP: మూడోసారి అధికారం బీజేపీదే: కిషన్‌రెడ్డి

BJP: మూడోసారి అధికారం బీజేపీదే: కిషన్‌రెడ్డి
జోరుగా విజయ సంకల్ప యాత్ర... కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులతో రోడ్‌షోలు, భారీ ర్యాలీలు, సభలు

లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి అధికారమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర జోరుగా సాగుతోంది. కేంద్రమంత్రులు, భాజపా పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో రోడ్‌షోలు, భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కిషన్‌రెడ్డి... మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారాసకు ఓటు వేస్తే ఒరిగేదేమీ లేదన్నారు. గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి కోల్పోయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. నరేంద్ర మోదీ మూడోసారి హాట్రీక్‌ కొడ్తారన్న బండి సంజయ్‌ …ప్రజల్లో బీజేపీపై అపారమైన నమ్మకముందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప సభలు నిర్వహిస్తున్న బీజేపీ.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై విమర్శల వర్షం గుప్పిస్తోంది.


పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ MP బండి సంజయ్ విశ్వాసం వ్యక్తంచేశారు. సిద్ధిపేట జిల్లా కోహెడలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండో విడత ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించారు. జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. దేశం సుభిక్షంగా ఆత్మ గౌరవంతో బతకాలంటే మోదీకే ఓటు వేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ యాత్రలో పాల్గొన్న ఈటల... పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా 10 సీట్లకుపైగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో చేపట్టిన యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు. యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న కమలం నాయకులు...పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీ హాట్రీక్‌ ఖాయమని ఉద్ఘాటించారు.


జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. దేశం సుభిక్షంగా ఆత్మ గౌరవంతో బతకాలంటే మోదీకే ఓటు వేయాలని.... ఈటల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ యాత్రలో పాల్గొన్న ఈటల...... తెలంగాణలో భాజపా 10 ఎంపీ సీట్లకుపైగా గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో చేపట్టిన యాత్రలో...... కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హాట్రిక్ ఖాయమన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. ప్రధాని మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారాసకు ఓటు వేస్తే ఒరిగేదేమీ లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story