ప్రైవేటు టీచర్లుకు...రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం

ప్రైవేటు టీచర్లుకు...రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బంది కుటుంబాలకు సాయం ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బంది కుటుంబాలకు సాయం ప్రకటించారు. గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు, సిబ్బందికి నెలకు 2 వేల రూపాయల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు వివరాలతో ఆయా జిల్లాల కలెక్టర్లకు ధరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. తెలంగాణలో పనిచేస్తున్న దాదాపు లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి లబ్ది చేకూరనుంది.

Tags

Read MoreRead Less
Next Story