జోగులాంబ సన్నిధిలో సీఎం కేసీఆర్ కుటుంబం..!
By - TV5 Digital Team |16 Feb 2021 12:00 PM GMT
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి గ్రూప్ దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు అబ్రహం, వెంకటేశ్వర్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com