మే మాసంలో యాదాద్రి ఆల‌యం పునఃప్రారంభం : సీఎం కేసీఆర్

మే మాసంలో యాదాద్రి ఆల‌యం పునఃప్రారంభం : సీఎం కేసీఆర్
ఈ రోజు యదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్... దేవాలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై సుమారుగా ఆరుగంటల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ రోజు యదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్... దేవాలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై సుమారుగా ఆరుగంటల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వచ్చే మే నెలాఖరు కల్లా యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవం ఉంటుందని.. అప్పటికల్లా పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి కి చేరుకున్న సీఎం, తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయంలో ఇంకా ఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.. అవి ఎన్నిరోజుల్లో పూర్తవుతాయనే విషయాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

Tags

Read MoreRead Less
Next Story