రేపు నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..!

రేపు నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..!
ఇప్పటికే అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందున్న జానారెడ్డి.. రేపు సాగర్‌లో భారీ బహిరంగ నిర్వహిస్తున్నారు.

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ఒక అడుగు ముందున్న జానారెడ్డి.. రేపు సాగర్‌లో భారీ బహిరంగ నిర్వహిస్తున్నారు. జనగర్జన పేరుతో జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభా ఏర్పాట్లను జానారెడ్డి తనయుడు జయవీర్‌రెడ్డి పరిశీలించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన జానారెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలని పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story