జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత
By - TV5 Digital Team |25 Dec 2020 7:44 AM GMT
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. జగిత్యాల జిల్లాలోని థరూర్ బ్రిడ్జిపై బండి సంజయ్ను అడ్డుకున్నారు నియోజకవర్గ టీఆర్ఎస్ సర్పంచ్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. జగిత్యాల జిల్లాలోని థరూర్ బ్రిడ్జిపై బండి సంజయ్ను అడ్డుకున్నారు నియోజకవర్గ టీఆర్ఎస్ సర్పంచ్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు. కేంద్రం ప్రభుత్వం నుండి వెంటనే గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ. 1024 కోట్లు విడుదల చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. తమ అధ్యక్షుడి పర్యటనను కావాలని అడ్డుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్లను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు పోటాపోటీ నినాదాలకు దిగారు. అయినా పోలీసులు చూస్తూ ఉండిపోవడంతో వాగ్వాదానికి దిగారు బీజేపీ నేతలు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com