TS: పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
By - Vijayanand |6 Feb 2023 8:24 AM GMT
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎంజీబీఎస్ - ఫలక్ నుమా మెట్రో లైన్; నిర్మాణానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్
పాతబస్తీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకుగాను రూ.500కోట్లను కేటాయించింది. దీంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రోకు మరో రూ.500కోట్లను కెటాయించింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎంజీబీఎస్ - ఫలక్ నుమా మధ్య మెట్రో నిర్మాణానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడటంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో మూడు కారిడార్లలో ఒకటైన పరేడ్ గ్రౌండ్ - ఫలక్ నుమా కారిడార్ ను 14 కిటోమీర్లు నిర్మించనున్నారు. గతంలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పరేడ్ గ్రౌండ్స్ నువచి ఎంజీబీఎస్ వరకు మాత్రమే మెట్రోమార్గాన్ని పూర్తి చేశారు. తాజాగా అడ్డంకులు తొలగి పోవడంతో ఫలక్ నుమా వరకు మెట్రోను పూర్తిచేయనుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com