TS: ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మహిళా కమిషన్‭కు షర్మిల ఫిర్యాదు

TS: ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మహిళా కమిషన్‭కు షర్మిల ఫిర్యాదు
మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు

ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై రాష్ట్ర మహిళా కమిషన్‭కు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైతే జాతీయ మహిళా కమిషన్‭ను కలుస్తానని షర్మిల చెప్పారు. మహిళలకు అన్యాయం జరుగుతున్నా బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారంలో ఉండి.. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని షర్మిల అన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలపై హత్యాచారాలు, కిడ్నాప్‭లు జరుగుతున్నాయని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో షీ టీమ్స్, సీసీ కెమెరాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు.

మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. పోడు భూముల కోసం పోరాడిన మహిళలను జుట్లు పట్టుకొని ఈడ్చుకెళ్లారని గుర్తుచేశారు. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా నేతలు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. గవర్నర్ పై కూడా నీచంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా.. మహిళా కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story