TS: ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయిలాంటిదే: రేవంత్‌

TS: ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయిలాంటిదే: రేవంత్‌
యాత్ర ఫర్ చేంజ్ పేరుతో రేవంత్‌రెడ్డి పాదయాత్ర, సింగరేణి కార్మికులతో గేట్‌ మీటింగ్‌

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని కేటీకే-5 ఇంక్లైన్‌లో ఆయన పర్యటించారు. సింగరేణి కార్మికులతో గేట్‌ మీటింగ్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు.యాత్ర ఫర్ చేంజ్ పేరుతో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. మార్గ మధ్యలో ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. విమర్శలు గుప్పించారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో వివరించారు.సంపూర్ణ మార్పు కోసమే యాత్ర చేపట్టామని ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని కామెంట్‌ చేశారు రేవంత్‌.పాదయాత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story