TS : బండి సంజయ్, రేవంత్ లకు వైఎస్ షర్మిల ఫోన్
టీపీసీసీ చీఫ్ రేవంత్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు వైస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ఉమ్మడి పోరుకు పిలుపు నిచ్చారు. పోరాటంలో అందరు కలిసి రావాలని షర్మిల కోరారు. ఉమ్మడి కార్యచరణ సిద్ధం చేద్దామని బండి సంజయ్, రేవంత్ను షర్మిల కోరారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఉమ్మడి పోరుకు బండి సంజయ్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే సమావేశం అవుదామని చెప్పినట్లు సమాచారం. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. అయితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. షర్మిల పిలుపుతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. షర్మిలతో కలిసి పోరాటానికి అన్ని పార్టీలు వెళ్తాయా లేదా అనే ప్రచారం జోరందుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com