TS : బండి సంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా

TS : బండి సంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా
దొంగతనం, మర్డర్ చేసిన వాళ్లకు కూడా బెయిల్ వస్తుందని ఎద్దేవా చేశారు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఫైరయ్యారు. బండి సంజయ్ తీరు విచిత్రంగా ఉందన్న ఎర్రబెల్లి.. బెయిల్ వస్తే ఏదో విజయం సాధించినట్లు చెబుతున్నారని విమర్శించారు. దొంగతనం, మర్డర్ చేసిన వాళ్లకు కూడా బెయిల్ వస్తుందని ఎద్దేవా చేశారు. ఇక బండి తప్పు చేశాడా లేదా అన్నది కోర్టు తేలుస్తుందన్నారు. రాజకీయాల కోసం విద్యార్థులను బలి చేస్తారా అని ప్రశ్నించారు. రెండు టెన్త్ పేపర్లు లీక్‌ చేసింది బీజేపీ వ్యక్తులేనన్నారు. అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్ బండి సంజయ్ అని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. లీకేజీ వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారని..కథ, స్క్రీన్ ప్లే ఢిల్లీది అయితే అందులో నటులు తెలంగాణ బీజేపీ నేతలన్నారు. ఏ2 ప్రశాంత్ తమవాడేనని బీజేపీ ఒప్పుకుందని.. చేసిన తప్పుకు విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story