TS : గవర్నర్లను ఏజెంట్లలా వాడుకుంటున్నారు : మంత్రి జగదీష్‌ రెడ్డి

TS : గవర్నర్లను ఏజెంట్లలా  వాడుకుంటున్నారు : మంత్రి జగదీష్‌ రెడ్డి
రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడమంటే దేశ అభివృద్ధిని అడ్డకోవడమేనని జగదీష్‌ రెడ్డి ఆరోపించారు

రాష్ట్రాల్లో అభివృద్ధి అడ్డుకోవడానికి గవర్నర్లను ఏజెంట్లలా బీజేపీ వాడుకుంటోంది తెలంగాణ మంత్రి జగదీష్‌ రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ వైఖరి కారణంగా నిర్ణీత వ్యవధిలో బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చందని అన్నారు. కేంద్రంలో మోడీ కార్యక్రమాలను రాష్ట్రపతి అడ్డుకోవడం లేదని.. మరి రాష్ట్రాలలో గవర్నర్లు అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్‌ అని ఆయన ప్రశ్నించారు. అక్కసుతో కేసీఆర్‌ను, తెలంగాణా అభివృద్ధిని అడ్డుకోవాలని కేంద్రం నాటకం ఆడుతోందని ఆరోపించారు. శాసనసభ ప్రసంగంలో తాను చెప్పిన అభివృద్ధి కార్యరూపం దాల్చకుండా గవర్నరే అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. గవర్నర్ తీరు భారత రాజ్యాంగ వ్యవస్థకు మంచిది కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోడమంటే దేశ అభివృద్ధిని అడ్డకోవడమేనని జగదీష్‌ రెడ్డి ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story