TS : ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద పులుల సంచారం

TS : ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద పులుల సంచారం
భీంపూర్‌ మండలం పిప్పల్‌కోట రిజర్వాయర్ సమీపంలో నాలుగు పులులు సంచారిస్తున్నాయి

ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద పులులు హల్‌చల్ చేస్తున్నాయి.‌ భీంపూర్‌ మండలం పిప్పల్‌కోట రిజర్వాయర్ సమీపంలో నాలుగు పులులు సంచారిస్తున్నాయి. అర్ధరాత్రి రిజర్వాయర్‌ వద్ద పని చేస్తున్నవారికి ఈ పులులు కన్పించాయి. గతంలో ఇదే ప్రాంతంలో సంచరించిన పులులుగా స్థానికులు భావిస్తున్నారు.

పులుల ఆనవాళ్ల కోసం అటవీ అధికారులు వెతుకుతున్నారు. గతంలో ఇక్కడికి వచ్చిన పులులా.. లేక వేరే పులులా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. పెన్‌ గంగ నదిని దాటి మహారాష్ట్రలోని.. తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్యం నుంచి వచ్చినట్లు గుర్తించారు. పులుల సంచారంతో పిప్పల్‌ కోట, తాంసి- కే, గొల్లగట్‌ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.


Tags

Read MoreRead Less
Next Story