TS : గిరిజనులతో గవర్నర్ తమిళిసై సమావేశం

TS : గిరిజనులతో గవర్నర్ తమిళిసై సమావేశం

రాజ్ భవన్ లో భద్రాచలం గిరిజనులతో సమావేశమయ్యారు గవర్నర్ తమిళసై. ఈ సమావేశంలో... జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ హర్ష చౌహాన్ సైతం ఉన్నారు. ఈ సందర్భంగా... గ్రామదేవత జాతరలకు నిధులు ఇవ్వాలని గవర్నర్ ను కోరారు గిరిజన ప్రతినిధులు. ఆలయ నిర్మాణాలు, గిరిజన సంస్కృతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సీజనల్ వ్యాధులతో గిరిజన మరణాలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా... గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు గవర్నర్ తమిళిసై. ఒక్కక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనేక సందర్భాల్లో గిరిజన ఏరియాల్లో పర్యటించానని.. గిరిజనుల ఇబ్బందులు తనకు తెలుసన్నారు తమిళసై.

Tags

Read MoreRead Less
Next Story