TS BJP : పేపర్ లీకేజీలపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలి : బండి సంజయ్

TS BJP : పేపర్ లీకేజీలపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలి : బండి సంజయ్
కల్వకుంట్ల కుటుంబమే లీకుల, లీక్కర్ వీరుల కుటుంబమని సంజయ్ ఆరోపించారు

తెలంగాణ ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు ఉంచారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. TSPSC, టెన్త్ పేపర్ లీకేజీలపై సిట్టింగ్​ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. ఒక్కో నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబమే లీకుల, లీక్కర్ వీరుల కుటుంబమని. TSPSC పేపర్ల లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని.. అప్పుడే దోషులందరూ బయటకు వస్తారని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని.. ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

వరంగల్ డీజీపీపై సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. సీపీ రంగనాథ్ చెప్పినవన్నీ నిజాలేనా అని ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే మూడు సింహలపై ప్రమాణం చేయాలన్నారు. హిందీ పేపర్ తాను లీకేజీ చేశానని తనని అరెస్ట్ చేశారని మరి ముందురోజు తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారని సంజయ్ ప్రశ్నించారు. హిందీ పేపర్ ను ఎవరైనా లీక్ చేస్తారా అని సంజయ్ ప్రశ్నించారు. ఎగ్జామ్ పేపర్ ఎవరో షేర్ చేస్తే తనకు సంబంధమేంటని అన్నారు. దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని, కేటీఆర్, కవిత జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. తెలంగాణను అభివృద్ది చేయడానికి పీఎం మోదీ సిద్దంగా ఉన్నారని, నిధులు కూడా కేటాయిస్తున్నారని, కానీ కేసీఆర్ ఆ నిధులును దారి మళ్లిస్తుండని సంజయ్ ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story