Bandlaguda: హోటల్‌‌లో కుళ్లిన మాంసాహారం.. కస్టమర్‌ ఫిర్యాదుతో..

Bandlaguda (tv5news.in)

Bandlaguda (tv5news.in)

Bandlaguda: ఆకలేస్తే ఆర్డరేయడమే ఇప్పుడు నడుస్తున్న స్టైల్‌.

Bandlaguda: ఆకలేస్తే ఆర్డరేయడమే ఇప్పుడు నడుస్తున్న స్టైల్‌. ఏ రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లి చికెన్‌ బిర్యానీయో, మటన్‌ బిర్యానీయో ఆర్డరిచ్చి లాగించేయడమే లేటెస్ట్‌ ట్రెండ్‌. రెస్టారెంట్‌కు వెళ్లే ఓపిక లేకపోతే స్విగ్గీ, జొమోటో లాంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ సంస్థలు ఎలానూ ఉన్నాయి. పేద, మద్య తరగతి ప్రజల ఈ చిన్ని ఆశను క్యాష్‌ చేసుకుంటున్నాయి కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్‌.

కుళ్లిన మాంసహార పదార్థాలను కస్టమర్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ దందా ఎక్కడో అక్కడ బయటపడుతున్నా రెస్టారెంట్లకు క్రేజీ తగ్గడం లేదు. తాజాగా.. కుళ్లిపోయిన మాంసహారాన్ని సరఫరా చేస్తున్న బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఓ రెస్టారెంట్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. బండ్లగూడ చౌరస్తా వద్ద ఉన్న జస్ట్‌ డ్రైవ్‌ ఇన్‌ హోటల్‌పై మున్సిపల్‌ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హోటల్‌ నిర్వాహకులు.. కుళ్లిపోయిన ఆహార పదార్థాలను కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఓ కస్టమర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మున్సిపల్‌ అధికారులు దాడులు నిర్వహించి కుళ్లిపోయిన మాంసహారంతో పాటు పలు రకాల ఆహార పదార్థాలను సీజ్‌ చేశారు. వాటిని పరీక్షల నిమిత్తం తరలించారు. మొదటి తప్పుగా భావించి హోటల్‌ యాజమన్యానికి 5వేల రుపాయల జరిమానా విధించారు.

Tags

Read MoreRead Less
Next Story