అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తాం : ఉత్తమ్

అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తాం : ఉత్తమ్
వారి పేర్లను గుర్తు పెట్టుకున్నామని.. అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని ఉత్తమ్ హెచ్చరించారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కాంగ్రెస్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 40 ఏళ్లుగా ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు చేసిన జానారెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పంట పొలాలకు నీళ్లు పారాయా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా అని ఉత్తమ్ ప్రశ్నించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారి పేర్లను గుర్తు పెట్టుకున్నామని.. అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని ఉత్తమ్ హెచ్చరించారు.


Tags

Read MoreRead Less
Next Story