బీజేపీకి ఓటేస్తే పింఛన్ కట్ చేస్తామని, డబుల్ బెడ్ రూం ఇల్లు రావని ఓటర్లను భయపెడుతున్నారు : రఘునందన్‌రావు

బీజేపీకి ఓటేస్తే పింఛన్ కట్ చేస్తామని, డబుల్ బెడ్ రూం ఇల్లు రావని ఓటర్లను భయపెడుతున్నారు : రఘునందన్‌రావు

దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లిలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్ పార్టీపై మండిపడ్డారు. బీజేపీకి ఓటేస్తే పింఛన్ కట్ చేస్తామని, డబుల్ బెడ్ రూం ఇండ్లు రావని ఓటర్లను భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి బీజేపీకి ఓటు వేయొద్దని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పెన్షన్ ఆపే అధికారం ఎవరికీ లేదని రఘునందన్ రావు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story