జలకళను సంతరించుకున్న అప్పర్ మానేర్ డ్యామ్
By - TV5 Digital Team |21 April 2021 11:15 AM GMT
కరీంనగర్ జిల్లాలోని అప్పర్ మానేర్ డ్యామ్ గోదావరి జలాలతో జలకళ సంతరించుకుంది. వర్షాకాలంలో కామారెడ్డి జిల్లాలోని కూడవెల్లివాగు నుంచి వర్షపు నీటీద్వారా అప్పర్ మానేరుకు నీరువచ్చేది.
కరీంనగర్ జిల్లాలోని అప్పర్ మానేర్ డ్యామ్ గోదావరి జలాలతో జలకళ సంతరించుకుంది. వర్షాకాలంలో కామారెడ్డి జిల్లాలోని కూడవెల్లివాగు నుంచి వర్షపు నీటీద్వారా అప్పర్ మానేరుకు నీరువచ్చేది. ఈ సంవత్సరం వర్షాకాలంలో వాగులు వంకలు, చెరువులు నిండటంతో రైతులు పెద్దయెత్తున వరి సాగుచేశారు. దీంతో ఒక్కసారిగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి.ఈ కారణంగా అప్పర్ మానేర్ డ్యామ్ పై ఆధారపడిన నాలుగు మండలాల రైతులు మంత్రి కేటీఆర్ ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. మంత్రి సూచన మేరకు అధికారులు కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లించడంతో అప్పర్ మానేర్ డ్యామ్ కు మళ్లీ జలకళ వచ్చింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com