CM Revanth Reddy : విద్యుత్ శాఖలో 3 అంశాలపై న్యాయ విచారణ

CM Revanth Reddy : విద్యుత్ శాఖలో 3 అంశాలపై న్యాయ విచారణ
24 గంటల కరెంట్ పై అఖిలపక్షంతో నిజనిర్ధారణ కమిటీ - సీఎం రేవంత్ ఆదేశం

విద్యుత్ శాఖలో మూడు అంశాలపై న్యాయ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని.. చత్తీష్ గడ్ ఒప్పదం, భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు. 24 గంటల కరెంట్ పై అఖిలపక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని తెలిపారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ రంగంపై జరిగిన చర్చ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ తో టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఛత్తీస్ ఘడ్ ఒప్పందంపై ఆనాడే తాము పోరాటం చేస్తే మార్షల్స్ తో తమను సభ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు.

ఛత్తీస్ గడ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెప్తే ఆ అధికారికి డిమోషన్ ఇచ్చి మారుమూల ప్రాంతాలకు పంపారని పేర్కొన్నారు. ఛత్తీస్ గడ్ తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకున్నారని, ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వంపై రూ.1362 కోట్ల భారం పడిందన్నారు. ఛత్తీస్ ఘడ్ ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. అలాగే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు కాలం చెల్లిన సంస్థతో ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు.

సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారని విమర్శించారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు. ఛత్తీస్ గడ్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ పాయింట్లలో జరిగిన అవినీతిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయిస్తామని చెప్పారు. 24 గంటల కరెంట్ పై అఖిల పక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేద్దామని అన్నారు.

జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయాలన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరిక మేరకు విచారణ చేయాలని తాను ఆదేశాలిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేసినామని అనుకుంటున్నారని తెలిపారు. తొమ్మిదిన్నర ఏళ్లలో గత ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టలేదన్నారు. విద్యుత్ శాఖను స్కాన్ చేసి వాస్తవాలను సభ ముందు పెడుతున్నామని తెలిపారు. గత పాలకులు వాస్తవాలను హుందాగా ఒప్పుకోవాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story