సెల్ఫీ దిగుతూ.. గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు
By - Nagesh Swarna |17 Oct 2020 7:32 AM GMT
కామారెడ్డి జిల్లాలో గోదావరిలో యువకుడు గల్లంత్యయాడు. నిజాంసాగర్ వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయాడు. గల్లంతయిన యువకుడి కోసం సహాయ బృందాలు గాలింపు చేపట్టాయి. అటు... నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు వద్ద సందర్శకుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు జలకళను చూసి ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే యువకుడు సెల్ఫీ దిగుతూ నీటిలో పడిపోయాడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com