YS sharmila New party : చేవెళ్ల నుంచే పాదయాత్ర?
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని పెడుతున్నారు షర్మిల. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి, సస్పెన్స్కు తెరదించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రత్యక్ష, పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పటికే కొత్త పార్టీ పేరును రిజిస్టర్ చేయడానికి ఎన్నికల కమిషన్కు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.
రాజన్న రాజ్యం తనతోనే సాధ్యం అంటూ అభిమానులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చెప్పుకొచ్చారు షర్మిల. రాజన్న రాజ్యం ఇప్పుడు కనిపించడం లేదంటూ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు షర్మిల. రాష్ట్రంలో రాజన్న రాజ్యం ఎందుకు లేదన్నదే తన ప్రశ్న అని చెప్పుకొచ్చారు. వచ్చే మార్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. పార్టీ పేరును, పార్టీ జెండా, అజెండాను అధికారికంగా ప్రకటించనున్నారు.
పార్టీ ప్రకటన చేసిన తరువాత.. మరింత దూకుడుగా వెళ్లాలనుకుంటున్నారు షర్మిల. తెలంగాణలోని దాదాపు వంద నియోజకవర్గాలను కవర్ చేస్తూ 16 నెలల పాటు పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచే పాదయాత్రను, ప్రచారాన్ని ప్రారంభించిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు. షర్మిల కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర మొదలుపెట్టనున్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు, అభిమానులతో సమావేశమయ్యారు షర్మిల. ఇక నుంచి రెండ్రోజులకు ఓసారి తెలంగాణలోని అన్ని జిల్లాల అభిమానులతో సమావేశం అవుతానని షర్మిల ప్రకటించారు. కొత్త పార్టీ కార్యాచరణపై ఇవాళ్టి నుంచే కసరత్తు ప్రారంభించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com