బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసులో మరో ట్విస్ట్

బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసులో మరో ట్విస్ట్

మనసు మమత', 'మౌనరాగం' వంటి సీరియళ్లతో పాపులర్‌ అయిన బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది..ఈ ఆత్మహత్య వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రధానంగా దేవ్‌రాజ్‌రెడ్డి, సాయికృష్ణ పేర్లు వినిపించాయి. అయితే..కొత్తగా 'ఆర్ఎక్స్-100' సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు కుటుంబ సభ్యులతో పాటు అశోక్ రెడ్డే కారణం అని దేవ్‌రాజ్ రెడ్డి చెబుతున్నాడు. అంతేకాదు.. తనను కాదని సాయితో పాటు అశోక్‌ రెడ్డితో కూడా ఆమె సన్నిహితంగా ఉండేదని కూడా ఆరోపణలు చేశాడు.

ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజు రెడ్డి SR నగర్ పోలీస్టేషన్‌ లో విచారణకు హాజరయ్యారు. శ్రావణిని ఫోన్‌లో బెదిరించిన ఆడియో... అశోక్ తో శ్రావణి చెప్పిన అంశాల ఆధారంగా ప్రశ్నించారు. ముఖ్యంగా దేవరాజ్, సాయి రెడ్డి కామెంట్స్‌ పైనే దృష్టి సారించారు. వీరి బెదిరింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దేవరాజ్ రెడ్డి విచారణ తర్వాత సాయి, శ్రావణి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. వారి స్టేట్ మెంట్స్ రికార్డుచేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే దేవరాజ్ రెడ్డి- శ్రావణిల ఆడియో టేపులు, వీడియోలను సేకరించిన పోలీసులు... ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు సాగిస్తున్నారు. కేసు వాపస్ తీసుకోకపోతే ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలను బయట పెడుతానని దేవరాజ్ రెడ్డి బెదిరిస్తున్నాడని శ్రావణి, సాయిరెడ్డికి చెప్పిన మరో ఆడియో కూడా బయటకు వచ్చింది. ఇక ఈ కేసులో సాయిరెడ్డితోపాటు అశోక్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.

అయితే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి వద్ద శ్రావణి, అశోక్ రెడ్డీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి అడ్డుపెట్టుకొని శ్రావణిని దేవరాజు బెదిరించినట్లు ఫోన్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అయితే సాయి, శ్రావణి మధ్య సంబంధాలు ఏమిటి..? శ్రావణి- దేవరాజ్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనేది తేలాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story