Bullettu Bandi : సాయిశ్రీయ ఎఫెక్ట్... యూట్యూబ్‌లో బుల్లెట్టు బండి రికార్డు.. !

Bullettu Bandi : సాయిశ్రీయ ఎఫెక్ట్... యూట్యూబ్‌లో బుల్లెట్టు బండి రికార్డు.. !
Bullettu Bandi : 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' ఇప్పుడు ఈ పాట లేకుండా పెళ్లిల్లు, ఈవెంట్స్ అయితే ఉండడం లేదు.

Bullettu Bandi : 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా' ఇప్పుడు ఈ పాట లేకుండా పెళ్లిల్లు, ఈవెంట్స్ అయితే ఉండడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరైనా సరే ఈ పల్లెటూరు పాటకి స్టెప్పులేస్తున్నారు. అయితే ఈ పాట తాజాగా యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా వంద మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది. అయితే ఈ పాటకు ఇంత రీచింగ్ రావడానికి మాత్రం కారణం నవవధువు సాయిశ్రీయ అనే చెప్పాలి.

వాస్తవానికి ఈ పాటకి క్రేజ్ ఉంది. కానీ సాయిశ్రీయ ఈ పాటకి తన పెళ్లి బరాత్ లో డాన్స్ చేసి ఆదరగోట్టడం, ఆ వీడియో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఆమె ఓవర్ నైట్‌‌లో సెలబ్రిటీ అయిపొయింది. అదేవిధంగా ఈ వీడియోని చూసిన చాలా మంది ఈ పాట ఒరిజినల్ సాంగ్‌‌ని యూట్యూబ్‌కి వెళ్లి మరి చూశారు. దీనితో పాటకి రీచింగ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వంద మిలియన్ల క్లబ్‌లో చేరిపోయింది.

ఈ పాటకి రచయిత లక్ష్మణ్‌ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించారు. బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ పాటని నిర్మించి.. ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలచేసింది. వంద మిలియన్లు రావడం పట్ల సింగర్ గాయని మోహన భోగరాజు ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'నా తొలి పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా' అంటూ పోస్టు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story