Entertainment: ఫ్యామిలీ డిన్నర్

Entertainment: ఫ్యామిలీ డిన్నర్
మహేష్‌బాబు నమ్రతతో పాటు తన దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబంతో కలిసి వారు ప్రారంభించిన ఏయన్‌ ప్యాలెస్‌ హైట్స్‌లో భోజనం

మహేష్‌ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబంతో సమయాన్ని గడపడానికి చాలా ఇష్టపడుతుంటాడు. అలాగే తన భార్య నమ్రత వ్యాపారంతో పాటు పలు సామాజిక సేవలో కూడా చురుగ్గా ఉంటారు. వారు చేసిన మంచి పనులను ఏమాత్రం ప్రచారం చేయకుండా సాధారనంగానే గడుపుతుంటారు. అయితే ఏసియన్‌ సునీల్‌తో కలిసి థియేటర్లు స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే.. వీరు మళ్లీ కలిసి ఈ మధ్యే హైదరాబాద్‌లో మినర్వా కాఫీ షాప్, ప్యాలెస్ హైట్స్ అనే ఒక రెస్టారెంట్ ను కూడా ప్రారంభించారు. విలాసవంతమైన వసతులతో రాయల్ డైనింగ్ అనుభూతిని ప్రజలకు అందించనున్నారు. కాగా మహేష్‌బాబు తన సతీమణి నమ్రతతో పాటు తన స్నేహితుడు దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబంతో కలిసి నిన్న వారు ప్రారంభించిన ఏయన్‌ ప్యాలెస్‌ హైట్స్‌లో భోజనం చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి మరీ..

Tags

Read MoreRead Less
Next Story