రెహమాన్ మ్యూజిక్ లో ఆ మ్యాజిక్ ఏమైంది..?

రెహమాన్ మ్యూజిక్ లో ఆ మ్యాజిక్ ఏమైంది..?
అతిచిన్న వయసులోనే కీబోర్డ్ ప్లేయర్‌‌గా కెరీర్‌‌ని ప్రారంభించి.. ఆ తరువాత సంగీత దర్శకుడిగా మారి.. తన మ్యూజిక్‌‌తో ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి రెహమాన్..

అతిచిన్న వయసులోనే కీబోర్డ్ ప్లేయర్‌‌గా కెరీర్‌‌ని ప్రారంభించి.. ఆ తరువాత సంగీత దర్శకుడిగా మారి.. తన మ్యూజిక్‌‌తో ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి రెహమాన్.. స్వరకర్త కోటి శిష్యునిగా పరిచయమైన రెహమాన్.. అనతి కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఎదిగాడు. 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా మూవీకి తొలిసారిగా సంగీతం అందించారు రెహమాన్. తొలి సినిమాకే నేషనల్ అవార్డు, తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్న రెహమాన్... ఆ తరువాత మణిరత్నం అన్ని సినిమాలకి రెహమానె మ్యూజిక్ అందిస్తూ వస్తున్నాడు. అలా వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యాయి. ప్రస్తుతం మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియా మువీకి సంగీతం అందించే పనిలో ఉన్నాడు రెహమాన్ .

ఇదిలావుండగా ఈ మధ్య రెహమాన్ మ్యూజిక్ లోని ఆ మ్యాజిక్ ని ప్రేక్షకులు మిస్ అవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య రెహమాన్ నుండి వచ్చిన పాటలు అంతగా ఆకట్టుకోవడం లేదని చెప్పాలి. తను మ్యూజిక్ అందిస్తున్న సినిమాల్లోని పాటలు ఒకటి అలా హిట్ అవుతున్నా మిగతావి మాత్రం గుర్తుంచుకునే స్థాయిలో ఉండడం లేదు. 90 దశకాల్లోని రెహమాన్ మ్యూజిక్ అంటే ఆల్బంలోని ప్రతి పాట ఓ సంచలనమే.. కానీ ఇప్పుడు అలా లేదు. చివరగా అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ఎం మాయ చేసావే సినిమాలోని పాటలన్ని పెద్ద హిట్టై సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కేవలం పాటలకోసమే ఈ సినిమాని చూసినవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో.. రెహమాన్ మళ్ళీ తన మ్యూజిక్ లోని మ్యాజిక్ ని రీపీట్ చేసి శ్రోతలని మునపటిలా ఆకట్టుకోవాలని మనము ఆశిద్దాం.



Tags

Read MoreRead Less
Next Story