భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది : జూనియర్ ఎన్టీఆర్

భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది : జూనియర్ ఎన్టీఆర్

సంగీత ప్రపంచంలో పాటల రారాజు ఎస్పీ బాలసుబ్రమణ్యం అస్తమించడం కలచివేసిందని అన్నారు జూనియర్ ఎన్టీఆర్.. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.. 'తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే' అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story