Rakshasudu 2: బెల్లంకొండ లేకుండానే 'రాక్షసుడు' సీక్వెల్..!

Rakshasudu 2: బెల్లంకొండ లేకుండానే రాక్షసుడు సీక్వెల్..!
Rakshasudu 2 : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు.

Rakshasudu 2 : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు. 2019లో విడుదలైన ఈ సైకలాజికల్ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరో బెల్లంకొండకి ఇదే మొదటి సక్సెస్ కూడా.. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌‌‌మెంట్‌‌ని చిత్రబృందం కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది. సాంకేతిక విభాగంలో ఎలాంటి మార్పులు లేకుండానే సీక్వెల్ తెరకెక్కబోతుంది కానీ తారాగణంలో మార్పులు ఉండబోతున్నాయి.

మొదటి పార్ట్‌‌లో కనిపించిన బెల్లంకొండ కాకుండా ఈ సీక్వెల్‌‌లో ఓ స్టార్ హీరో కనిపించనున్నాడని తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. అయితే మొదటి పార్ట్‌‌లో కనిపించిన హీరోతో కాకుండా మరో హీరోతో సీక్వెల్‌‌‌‌ని తెరకెక్కించడం అనేది చాలా అరుదు. ఇప్పటివరకు అలా చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ప్రస్తుతం రమేష్ వర్మ.. రవితేజతో ఖిలాడి అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా తరవాత రాక్షసుడు 2 పట్టాలెక్కనుంది.

Tags

Read MoreRead Less
Next Story