Raviteja Khiladi : ధియేటర్లోనే ఖిలాడి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
Raviteja Khiladi : కరోనా కారణంగా మరోసారి థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.. దీనితో పలు సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నాయి. కానీ మరికొన్ని చిత్రాలు మాత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో విడుదలవుతున్నాయి. అందులో భాగంగానే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న "ఖిలాడి" చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుందని నెట్టింట్లో జోరుగా ప్రచారం నడుస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే చిత్ర బృందంతో ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు స్పందించారు. ఖిలాడి చిత్రం విడుదల పై వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా అనుభవాన్ని థియేటర్లోనే పొందాలని, దానికి అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎక్కడా కూడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నామని అన్నారు.
ఈ విషయంలో చిత్ర దర్శకుడు రమేష్ వర్మ బాగా శ్రమిస్తున్నారని అన్నారు. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com