శివరాత్రి కానుకగా శర్వానంద్ 'శ్రీకారం'
By - TV5 Digital Team |23 Jan 2021 4:08 PM GMT
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం.. శర్వానంద్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం.. శర్వానంద్ సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కిశోర్ బి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుగా తీసుకువచ్చేందుకు చిత్ర బృందం రెడీ అయిపొయింది. ఈ మేరకు రిలీజ్ డేట్ ని అనౌన్సు చేస్తూ పోస్టర్ను కూడా విడుదల చేశారు. విలేజ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తుండగా.. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com