మే 31న పూనకాలే...

మే 31న పూనకాలే...
మాస్ స్ట్రైక్ కు రెడీ అవుతోన్న ఎస్ఎస్ఎంబీ28 టీమ్...

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి థియేటర్లను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసినీ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబీ 28 నుంచి ఎప్పటికప్పుడు వస్తోన్న కొత్త అప్ డేట్స్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తున్నాయని చెప్పాల్సిందే. అయితే తాజాగా విడుదలైన మరో లుక్ ప్రేక్షకులతో పాటూ ట్రేడ్ పండితుల అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఇక మాటల మాంత్రికుడి రెగ్యులర్ టచ్ కు భిన్నంగా ఎస్ఎస్ఎంబీ 28 ఉండబోతోందని తెలుస్తోంది. సాధారణంగా క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే త్రివిక్రమ్ ఈసారి మాస్ మేనియా క్రియేట్ చేయబోతున్నాడని ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గర నుంచి అర్థమవుతూనే ఉంది. మహేశ్ ఫ్యాన్స్ సైతం ప్రిన్స్ ను ఊర మాస్ గెటప్ లో చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాదు మే 31న మాస్ స్ట్రైక్ అంటూ ప్రేక్షకులను తెగ ఊరించేస్తున్నారు చిత్ర బృందం. ఇక మహేశ్ బాబు కు జోడీగా అందాల పూజా హెగ్డే తోపాటూ శ్రీలీల కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఇదే ఊపులో సూపర్ స్టార్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడేమో చూడాలి.




Tags

Read MoreRead Less
Next Story