ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలో చిరంజీవికి డూపుగా నటించింది వీరిద్దరే..!

ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలో చిరంజీవికి డూపుగా నటించింది వీరిద్దరే..!
మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే అప్పట్లో ఎక్కడలేని క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా దాదాపుగా హిట్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే అప్పట్లో ఎక్కడలేని క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా దాదాపుగా హిట్ అయింది. అందులో భాగంగానే 1994లో చిరంజీవి త్రిపాత్రాభినయంగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి నిర్మించారు.

నగ్మా, రమ్యకృష్ణ, రోజా హీరోయిన్ లుగా నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో ఏదో ఒక పాత్రను చిరంజీవి పోషిస్తూ మిగిలిన రెండు పాత్రలను డూప్ గా పెట్టడం జరిగింది. అయితే మిగతా రెండు డూప్ పాత్రల్లో చిరంజీవి స్నేహితుడు ప్రసాద్ బాబు నటించగా, మరో పాత్రలో చిరు.. పర్సనల్ మెన్ పి.ఏ సుబ్బారావు నటించారు. అయితే ఈ మూడు పాత్రలకి చిరు విభిన్నమైన డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్నారు.



Tags

Read MoreRead Less
Next Story