JR NTR : నాకు అదే అతి పెద్ద కానుక.. అభిమానులకి ఎన్టీఆర్ లేఖ.. !

JR NTR : నాకు అదే అతి పెద్ద కానుక.. అభిమానులకి ఎన్టీఆర్ లేఖ.. !
JR NTR: తన అభిమానులకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేఖ రాశారు. ఈ లేఖలో ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు(మే 20) ఏవిధమైన వేడుకలు చేయవద్దని సూచించారు.

JR NTR: తన అభిమానులకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేఖ రాశారు. ఈ లేఖలో ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు(మే 20) ఏవిధమైన వేడుకలు చేయవద్దని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు ఎన్టీఆర్. " అభిమానులకు విన్నపం.. నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను . గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను, మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకుని, కోవిడ్‌ ను జయిస్తాను అని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా మీరు నా పుట్టిన రోజున చూపే ప్రమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను.

కానీ ఈ సంవత్సరం మీరు ఇంటి పట్టునే ఉంటూ, లాక్‌ దౌన్‌ లేదా కర్ఫ్యూ నియమాలను పాటిస్తూ జాగ్రత్త గా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరుగని పోరాటం చేస్తున్న మన దాక్టర్లు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అందగా నిలబడాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్త గా చూసుకోండి. మీరు జాగ్రత్త గా ఉండండి. ఒకరికి బకరు సహాయం చేసుకుంటూ, చేతనైన ఉపకారం చేయండి.

త్వరలో మన దేశం ఈ కరోనా ను జయిస్తుంది అని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు, మాస్క్‌ ధరించండి. జాగ్రత్త గా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను" అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.




Tags

Read MoreRead Less
Next Story