'సింహాద్రి' చిత్ర నిర్మాత కన్నుమూత
By - Nagesh Swarna |18 Jan 2021 4:19 AM GMT
సింహాద్రి, సీతారామయ్యగారి మనవరాలు, కిరాయిదాదా, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అన్నమయ్య వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.
తెలుగు సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దొరస్వామిరాజు కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో బంజారాహిల్స్ లోని ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. సింహాద్రి, సీతారామయ్యగారి మనవరాలు, కిరాయిదాదా, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అన్నమయ్య వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. అంతేకాకుండా సుమారు 750 చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగారు. దొరస్వామి మృతి పట్ల సినీ ప్రముఖలు సంతాపం ప్రకటించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com