వర్ధమాన కథా రచయిత కొండవీటి వంశీ రాజేష్ కన్నుమూత

వర్ధమాన కథా రచయిత కొండవీటి వంశీ రాజేష్ కన్నుమూత

కరోనా కారణంగా వర్ధమాన సినీ కథా రచయిత కొండవీటి వంశీ రాజేష్ మరణించారు. కొద్దిరోజుల కిందట ఆయనకు కరోనా సోకింది..దాంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. వంశీ రాజేష్ మరణించారన్న విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.. రాజేష్ మృతిని తాను నమ్మలేకపోతున్నాని పేర్కొన్నారు. ప్రతిభావంతుడైన రచయిత వంశీ రాజేష్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యానని.. చాలా బాధగా ఉందని వంశీ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీను వైట్ల పేర్కొన్నారు.



Tags

Read MoreRead Less
Next Story