మద్యం సేవించి సెల్ఫీలు దిగి ఆపై ప్రేమజంట..

మద్యం సేవించి సెల్ఫీలు దిగి ఆపై ప్రేమజంట..

ప్రేమ విఫలమైందని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకంటే ముందు తాము చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకొని తుపాకీతో కాల్చుకున్నారు. ఈ ఘటన రాజస్ధాన్‌లోని బార్మర్‌ జిల్లాలో వెలుగులోకివచ్చింది. బార్మర్‌ ప్రాంతానికి చెందిన అంజు సుతార్‌, శంకార్‌ చౌదురి లు ప్రేమించుకున్నారు. వీరు వివాహం కాక ముందు నుంచే సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అంజూ సుతార్‌కు ఇంట్లో వాళ్ళు పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. ఈ పెళ్లి ఇష్టం లేని అంజు సుతార్‌ ప్రేమించిన యువకుడితో వివాహం జరిపించాలని పెద్దలను కోరింది. అయితే వారు పెళ్ళికి ఒప్పుకోలేదు. దాంతో తాము ఇక కలిసి ఉండలేమని అనుకున్నారు. వారి మొబైల్‌ ఫోన్‌లో ఆడియో క్లిప్‌లో రికార్డు చేసి మద్యం సేవించి వెంట తెచ్చుకున్న నాటుతుపాకులతో కాల్చుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ రెండు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story