Kemune: 3,400 ఏళ్లనాటి పురాతన నగరం.. ఇన్నాళ్లకు బయటపడింది..

Kemune: 3,400 ఏళ్లనాటి పురాతన నగరం.. ఇన్నాళ్లకు బయటపడింది..
Kemune: ఇరాక్‌ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఓ భారీ జలాశయం కరువు వల్ల ఎండిపోయింది.

Kemune: కరువుతో నిత్యం అలమటించిపోయే దేశాల్లో ఇరాక్ ఒకటి. అలాంటి ఇరాక్‌లో ఇటీవల ఓ జలాశయం ఎండిపోయింది. కానీ అది ఎండిపోవడం వల్లే ఓ అద్భుతం బయటపడింది. ఇంతకాలంగా ఆ జలాశయం కింద ఓ నగరం దాగి ఉందన్న విషయం.. అది ఎండిపోయిన తర్వాతే తెలిసింది. అందుకే వెంటనే కుర్దిష్‌, జర్మనీ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని పరీక్షించి మరిన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

ఇరాక్‌ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఓ భారీ జలాశయం కరువు వల్ల ఎండిపోయింది. దీంతో 3,400 ఏళ్లనాటి పురాతన నగరం బయటపడింది. ఈ నగరం దాదాపు క్రీస్తూ పూర్వం 1550 నాటిది అని అంచనా వేస్తున్నారు పూరావస్తు శాస్త్రవేత్తలు. అంతే కాకుండా మిట్టని సామ్రాజ్య పాలన సమయంలో ఈ నగరం ప్రధాన కేంద్రంగా ఉండి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.

ఇక కరువు వల్ల ఎండిపోయిన జలాశయం వల్ల ఈ నగరం బయటపడింది. అయితే మళ్లీ ఆ జలాశయంలో మెల్లగా నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో ఆ నగరం దెబ్బతినకూడదని ప్లాస్టిక్‌ షీట్‌లతో దీన్ని మొత్తం కప్పేశారు. మట్టి గోడలు, శిథిలాలు చాలా పురాతన కాలం నాటివి కాబట్టి నీటి వల్ల సులభంగా ధ్వంసం అయ్యే అవకాశం ఉందని వారు ఈ పని చేసినట్టుగా శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story