పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. 10మంది మృతి
By - shanmukha |8 Sep 2020 2:26 AM GMT
పాకిస్థాన్లో మార్బుల్ గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది
పాకిస్థాన్లో మార్బుల్ గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖైబర్పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని మొహ్మండ్ జిల్లాలో ఈ ఘటనలో అక్కడికక్కడే పలువురు మృతి చెందారు. మృతుల సంఖ్యపై స్పష్టత లేకపోయినప్పటికీ.. కనీషం 10 మంది మరణించి ఉంటారని సమాచారం. అటు, మరో 8మంది తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తుంది. కొండచరియలు విగిరిపడటంతో ఈ ప్రమాదం సంభంవించింది. శిథిలాల క్రింద ఉన్నవారిని వెలికితీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com