నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి
ఈ ఏడాది కరోనాకు తోడు నేపాల్‌ను ప్రకృతి విపత్తులు కూడా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి

ఈ ఏడాది కరోనాకు తోడు నేపాల్‌ను ప్రకృతి విపత్తులు కూడా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారు. నేపాల్‌లోని సియాంగ్జా జిల్లాలలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ప్రమాదం చోటుచేసుకుంది. పది మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. గాయాలపాలైనవారిని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story