నేపాల్లో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి
By - shanmukha |24 Sep 2020 11:07 AM GMT
ఈ ఏడాది కరోనాకు తోడు నేపాల్ను ప్రకృతి విపత్తులు కూడా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి
ఈ ఏడాది కరోనాకు తోడు నేపాల్ను ప్రకృతి విపత్తులు కూడా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారు. నేపాల్లోని సియాంగ్జా జిల్లాలలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ప్రమాదం చోటుచేసుకుంది. పది మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. గాయాలపాలైనవారిని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com