Nigeria : దాడిలో 26 మంది సైనికుల మృతి

Nigeria : దాడిలో 26 మంది సైనికుల మృతి
క్రిమినల్ గ్రూపు కాల్పులకి కూలిన హెలికాప్టర్

నైజీరియా లో భద్రతా దళాలపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఈ ముష్కరుల దాడిలో 26 మంది సైనికులు మరణించారు. అర్థరాత్రి ఓ క్రిమినల్ గ్రూపు జరిపిన ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు.

గత కొంత కాలంగా నైజీరియా సైన్యం కొంతమంది క్రిమినల్ గ్రూపులను మట్టుపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వారిపై దొరికిన వారిని దొరికినట్టుగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అదను చూసుకొని ఆ క్రిమినల్ గ్రూప్ సైనికులపై దాడికి దిగింది.


ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు చనిపోవడంతో వారిని రక్షించడానికి హెలికాప్టర్ ను ఉపయోగించారు. అయితే ఆసుపత్రికి తరలించేందుకు వచ్చిన ఎంఐ-171 హెలికాప్టర్ జుంగేరు నుంచి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయిందని మిలటరీ అధికారులు చెప్పారు. క్రిమినల్ గ్రూపు కాల్పుల కారణంగానే హెలికాప్టర్ కూలిపోయిందని నైజీరియా మిలటరీ వర్గాలు ప్రకటించాయి. విమానం జుంగేరు ప్రాథమిక పాఠశాల నుంచి కడునాకు బయలుదేరిందని, అయితే నైజర్ రాష్ట్రంలోని షిరోరో స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని చుకుబా విలేజ్ సమీపంలో అది కూలిపోయినట్లు గుర్తించామని సైనిక ప్రతినిధి ఎడ్వర్డ్ గబ్క్వెట్ ఒక ప్రకటనలో తెలిపారు.విమానంలో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.

నైజీరియాలో నైజర్, కడునా, జంఫారా, కట్సినా రాష్ట్రాల్లో అడవుల్లో క్రిమినల్ ముఠాలు శిబిరాలు నిర్వహిస్తూ దాడులు, కిడ్నాప్ లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story