అమెరికన్ సింగర్ నోట.. 'ఓం జై జగదీష్ హరే' పాట..

అమెరికన్ సింగర్ నోట.. ఓం జై జగదీష్ హరే పాట..
గాయని మేరీ మిల్బెన్ పాడిన 'ఓం జై జగదీష్ హరే' అనే భక్తి శ్లోకం ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.

నిజంగా భారతీయులమైన మనం కూడా అంత భక్తి పారవశ్యంతో ఆ పాటను పాడలేమేమో.. అంతగా తన్మయత్వం చెందుతూ ఓం జై జగదీష్ హరే పాటను ఆలపించారు ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి. గాయని మేరీ మిల్బెన్ పాడిన 'ఓం జై జగదీష్ హరే' అనే భక్తి శ్లోకం ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.

ఈ ప్రదర్శనను యూట్యూబ్‌లో గురువారం మిల్బెన్ పోస్ట్ చేశారు. పాటను ఆలపిస్తున్న సందర్భంలో ఆమె ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ గృహాలలో సాధారణంగా పాడే అందమైన హిందీ శ్లోకం. ఇది ఆరాధన వేడుకల పాట. ఈ శ్లోకం నన్ను కదిలించడం, నా ఆత్మను తాకడంతో పాటు భారతీయ సంస్కృతి పట్ల నా అభిరుచిని రేకెత్తిస్తూనే ఉంది "అని ఆమె పోస్ట్ చేసింది.

వీడియోలో మిల్బెన్ పింక్ లెహంగాలో కనిపిస్తుంది. ఆమె నుదిటిపై పెట్టుకున్న బొట్టు, ఆభరణాలు నెటిజన్స్‌ని ఆకర్షిస్తున్నాయి. భారతీయ సంస్కృతి ఉట్టిపడుతున్న ఆమె ఆహార్యం పలువురిని ఆకట్టుకుంది.

మిల్బెన్ ఈ వీడియో ఫుటేజీని కూడా ట్విట్టర్‌లో పంచుకున్నారు. "దీపావళి 2020 కోసం ప్రదర్శన ఇవ్వడం చాలా మంచి విషయంగా భావిస్తున్నాను. మీ అందిరితో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

"హాలీవుడ్‌లో నటిగా, గాయనిగా ఎంతో పేరు సంపాదించినా, హిందీని అధ్యయనం చేయడం ద్వారా భారతదేశంపై గాఢమైన అభిమానాన్ని పెంచుకున్నాను. భారతదేశం యొక్క సంస్కృతి, సంగీతం, సినిమాపై నాకు ఎనలేని ప్రేమ అని మిల్బెన్ అన్నారు.

ఇంతకుముందు, ఈ సంవత్సరం ఆగస్టు 15 న 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమె పాడిన భారత జాతీయ గీతం యొక్క వీడియోను గాయని పోస్ట్ చేసింది, ఇది కూడా అప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. దీనికి ఆమె ప్రశంసలు అందుకుంది.

ఆమెను అభినందిస్తూ, డాక్టర్ మోక్స్‌రాజ్ భారతీయ సంస్కృతి పట్ల ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. "భారతీయ భాష, సంస్కృతి మరియు సంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి ఆమె ఉత్సాహంగా ఉంది. ఈ భజన ద్వారా భారతీయులందరినీ కోరుకుంటున్నాను. ఆమె ఆసక్తి, పాట నేర్చుకోవాలన్న పట్టుదలను చూసి నేను గర్వపడుతున్నాను, అని అతను చెప్పారు.

ఈ పాటను రికార్డ్ చేయమని, ప్రదర్శించమని నన్ను ప్రోత్సహించిన మొదటి వ్యక్తి నా తల్లి రెవరెండ్ ఆల్తీయా మిల్బెన్. ఈ సమయంలో మన ఆత్మలను ఏకం చేసే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా మనందరికీ అవసరం. " మిల్బెన్ అన్నారు. మిల్బెన్ అమెరికా అధ్యక్షులు జార్జ్ డబ్ల్యు బుష్, బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story