Airstrikes : అఫ్గాన్‌పై అర్ధరాత్రి పాక్‌ వైమానిక దాడులు..

Airstrikes : అఫ్గాన్‌పై అర్ధరాత్రి పాక్‌ వైమానిక దాడులు..
8 మంది దుర్మరణం, పలు నివాసాలు ధ్వంసం

అఫ్గానిస్థాన్‌పై అర్ధరాత్రి పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. అఫ్గానిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లోగల బర్మాల్‌ జిల్లాలో, ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోగల సెపెరా జిల్లాలోని అఫ్గాన్‌ దుబాయ్‌ ఏరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. సాధారణ పౌర నివాసాలే లక్ష్యంగా పాకిస్థాన్‌ ఈ వైమానిక దాడులకు పాల్పడింది. తాలిబన్‌ల ఏలుబడిలో ఉన్న అఫ్గానిస్థాన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

పాకిస్థాన్ వైమానిక దాడుల్లో పక్తికా ప్రావిన్స్‌లోని ఆరుగురు దుర్మరణం పాలయ్యారని, వారిలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారని ముజాహిద్‌ తెలిపారు. అదేవిధంగా ఖోస్ట్‌ ప్రావిన్స్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులతో కుప్పకూలిన భవన శిథిలాల కింద చిక్కుకుని మరో ఇద్దరు మహిళలు మరణించారని చెప్పారు. కాగా ఈ దాడులను ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ తీవ్రంగా ఖండించింది. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఈ వైమానిక దాడులు జరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story