Artificial intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు-IMF చీఫ్‌ క్రిస్టలినా

Artificial intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు-IMF చీఫ్‌ క్రిస్టలినా
అభివృద్ధి చెందిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలపై AI ఎఫెక్ట్‌

త్రిమ మేథ తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)’ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జియేవా అభిప్రాయపడ్డారు. కొన్ని రకాల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. ఇంకోవైపు ఉత్పాదకతను గణనీయంగా పెంచి ప్రపంచవృద్ధికి దోహదం చేసే అవకాశాలనూ ఈ అత్యాధునిక సాంకేతికత తెచ్చిపెడుతుందని ఆమె చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు’ వెళ్లడానికి ముందు ఆదివారం మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టలినా మాట్లాడారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడించారు. అధునాతన ఆర్థిక వ్యవస్థలలో 60 శాతం ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లోని వార్షిక ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌కు బయలుదేరడానికి ముందు వాషింగ్టన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏఐ తక్కువ ప్రభావం చూపుతుందని అంచనా వేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆమె ఐఎంఎఫ్ నివేదికను ఉటంకిస్తూ చెప్పారు. ఏఐ కారణంగా మెరుగైన ఉత్పాదకత లాభాలతో ప్రయోజనం పొందవచ్చునని ఆమె చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏఐకి సంబంధిత ఉత్పాదకత బూస్ట్‌ను ఉపయోగించగలదన్నారు.అభివృద్ధి దేశాల్లో దాదాపు 60 శాతం ఉద్యోగాలపై ఈ కృత్రిమ మేథ ప్రభావం ఉంటుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం 40 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేశారు. నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు అధికంగా ఉన్న రంగాలపై ఈ సాంకేతికత ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విధానానికి 2024 కఠినమైన సంవత్సరంగా ఉండే అవకాశం ఉందని జార్జివా చెప్పారు. పలు దేశాలు కొవిడ్ -19 మహమ్మారి సమయంలో పేరుకుపోయిన రుణ భారాలను పరిష్కరించడానికి యత్నిస్తున్నాయన్నారు.కృత్రిమ మేథతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేలా పేద దేశాలకు మద్దతివ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అమలు చేసిన ద్రవ్య విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోందని క్రిస్టలినా తెలిపారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story