Maldives: మాల్దీవుల్లో ముయిజ్జు పార్టీ విక్టరీ..

Maldives: మాల్దీవుల్లో ముయిజ్జు పార్టీ విక్టరీ..
ముయిజ్జు మళ్లీ గెలవడంపై స్పందించిన భారత్

గత కొంతకాలంగా భారత్-మాల్దీవుల సంబంధాలు ఏమంత సజావుగా లేవన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మాల్దీవుల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దేశాధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి అధికార పీఠంపై కొలువుదీరనున్నారు. దీనిపై భారత్ ఆచితూచి స్పందించింది. పార్లమెంటు ఎన్నికలు విజయవంతంగా జరుపుకున్న మాల్దీవులకు భారత్ నుంచి అభినందనలు తెలుపుతున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన చేశారు.

గత కొంతకాలంగా, కొన్ని అంశాలపై ఇరు దేశాల మధ్య పార్లమెంటు స్థాయిలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, మాల్దీవుల్లో కొలువుదీరనున్న కొత్త పార్లమెంటుతోనూ సంప్రదింపులు జరపడంపై ఆశాభావంతో ఉన్నామని పేర్కొన్నారు. భారత్, మాల్దీవుల మధ్య సుదీర్ఘ, చారిత్రక సంబంధాలు ఉన్నాయని, మాల్దీవులతో కలిసి అనేక అభివృద్ధి, సహకార కార్యక్రమాలు చేపడుతున్నామని జైస్వాల్ వివరించారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు విజయవంతమైనందుకు మాల్దీవులకు భారత్ అభినందనలు తెలిపింది. ఇరుదేశాల మధ్య సుదీర్ఘ, చారిత్రక సంబంధం ఉందని గుర్తుచేసింది. ఆ దేశంతో కలిసి అనేక అభివృద్ధి సహకార కార్యక్రమాలు చేపడుతున్నామని… పార్లమెంటు స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని గుర్తుచేసింది. కొత్త పీపుల్స్‌ మజ్లిస్‌తోనూ అవి కొనసాగుతాయని భావిస్తున్నామని మీడియా సమావేశంలో జైశ్వాల్‌ పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి స్థానికంగా బలమైన మద్దతు లభించినట్లయింది. భారీ మెజార్టీ కారణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం కూడా ఆయనకు లభించింది.

ఇటీవల మాల్దీవులకు భారత్ మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. లక్ష్యదీప్‌లో ప్రధాని మోడీ పర్యటించి.. పర్యాటకులు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా ఇండియా నుంచి పర్యాటకుల సంఖ్య కూడా పడిపోయింది. తాజాగా మాల్దీవులు.. భారత్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story