Dawood Ibrahim : నిక్షేపంగా ఉన్నాడు... మళ్లీ పెళ్లి కూడా చేసుకున్నాడట...!

Dawood Ibrahim : నిక్షేపంగా ఉన్నాడు... మళ్లీ పెళ్లి కూడా చేసుకున్నాడట...!
ఉగ్రవాది దావుద్ ఇబ్రహీం బతికే ఉన్నడు... దావుద్ సోదరి హసీనా పార్కర్ తనయుడిని అదుపులోకి తీసుకుని విచారించిన ఎన్.ఐ.ఎ.



అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం (67) గురించి సంచలన వార్తలు బయటకు వచ్చాయి. దావుద్ పాకిస్థాన్ కు చెందిన మహిళను రెండో పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని దావుద్ సోదరి, హసీనా పార్కర్ కుమారుడు అలీషా ఇబ్రహీం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( NIA )కు వెళ్లడించాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుస్తోంది. దావుద్ పాకిస్తాన్ లోని కరాచీలోనే ఉన్నట్లు అతను స్పష్టం చేశాడు. సెప్టెంబర్ 2022లో అలీషా NIAముందు ఈ విషయాలను తెలియజేసినట్లుగా సమాచారం.

NIA ఇప్పటికే దావుద్ ఇబ్రహీంకు సంబంధించిన పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ ఆపరేషన్ లో అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారించింది. ఇందులో భాగంగా అలీషాను విచారించగా దావుద్ రెండో వివాహం గురించి తెలిసినట్లు NIA అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి, ఏజెన్సీ కోర్టులో చార్జిషీట్ ను ఎన్ఐఏ సమర్పించింది. ఈ విషయాలపై భారత ఇంటెలిజెన్స్ అధికారులు పెదవి విరుస్తున్నారు. భారత దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చడానికే, దావూద్ ఇలాంటి వార్తలను వ్యాప్తిచేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

అలీషా మాత్రం, జులై 2022లో తాను దావుద్ ఇబ్రహీం మొదటి భార్యను దుబాయ్ లో కలిశానని చెప్పాడు. ఆవిడే దావుద్ రెండో వివాహం గురించి తనకు చెప్పిందని తెలిపాడు. దావుద్ వాట్సప్ కాల్ ద్వారా భారత్ లో ఉన్న తన బంధువులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story